SKLM: ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని జడ్పీ ఛైర్పర్సన్ విజయ అన్నారు. ఆదివారం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు సూచించిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి, నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం ఉండరాదు అని పేర్కొన్నారు.