KDP: గాలివీడు మండలంలో పోలీసుల ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో సౌరశక్తితో పనిచేసే డ్యూయల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరవీడు గ్రామంలో దాత మందపాటి రవీంద్ర బాబు, గరుగుపల్లి సచివాలయం వద్ద మోపురి వెంకటరమణ సహకారంతో కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ భద్రత కోసం సహకరించిన దాతలు, ప్రజలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.