ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ను ఛైర్పర్సన్ బల్లా పల్లవి శనివారం సందర్శించారు. రైతులు, వ్యాపారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్నదాతల కష్టాలను గుర్తించి తగిన పరిష్కారాలు చూపడం, వారి ఆర్థికాభివృద్ధికి నిరంతరం కృషి చేయడం తన బాధ్యతని పల్లవి పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్లో అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.