PLD: పిడుగురాళ్లలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వయంగా రోడ్లను శుభ్రం చేసిన ఆయన, పరిసరాలు బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.