TPT: నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వివిధ అవకాశాలు, సబ్సిడీలు, పథకాల వివరాలు తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. రైతులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.