సత్యసాయి: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కదిరిలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త బీయస్.మక్బుల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకుల అక్రమ అరెస్టులను ఖండించారు.