ADB: శ్రీ సరస్వతి శిశు మందిరాలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని తెలంగాణ రాష్ట్ర ఆధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ అన్నారు. ఇచ్చోడ మండలంలో నిర్వహించిన శ్రీ సరస్వతి విద్యాపీఠం 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. శిశు మందిరాల్లో చదువుతోపాటు వినయం, విధేయత, దేశభక్తి వంటి విషయాలను బోధించడం జరుగుతుందన్నారు.