RR: చేవెళ్ల మండలం హస్తేపూర్ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశు వైద్యులు మాట్లాడుతూ.. పశువులలో ప్రాణాంతక గాలికుంటు వ్యాధిని నివారించడానికి ముందస్తు టీకాలు వేయించడం తప్పనిసరి అన్నారు. ఈ టీకాలు వేయడంతో పశువులకు రోదనిరోధక శక్తిని కల్పిస్తుందన్నారు.