VKB: తాండూర్ యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అందరం కలిసికట్టుగా తరిమికొట్టాలని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మత్తు రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆమె కోరారు.