BHPL: జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మంగళవారం యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా SP సిరిశెట్టి సంకీర్త్ హాజరై మాట్లాడారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ అనుచిత చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్ శిక్షార్హ నేరమని, దీనికి పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.