కృష్ణా: గుడివాడ చాపల మార్కెట్ వినాయకుడి గుడి సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు, పోలీస్ సిబ్బందితో కలిసి వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ పేకాట శిబిరంపై బుధవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న 11మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, రూ. 13,670ల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.