సత్యసాయి: పుట్టపర్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి ఆమె స్వయంగా వినతులు స్వీకరించారు. విద్య, వైద్యం, పెన్షన్లు వంటి వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.