సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి (CHC)ని నేడు ఉదయం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సందర్శించనున్నారు. ఆసుపత్రిలో అమలవుతున్న బయోమెడికల్ వ్యర్థాల బార్కోడ్ సిస్టమ్ను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి పరిశుభ్రతపై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. శానిటేషన్ సిబ్బందితో వ్యర్థాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు.