NDL: మహానంది రెగ్యులర్ తహసీల్దారుగా పీ. రమాదేవిని నియమిస్తూ బుధవారం కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహసీల్దారుగా ఉన్న ఆమెకు తహసీల్దారుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం మహానంది మండలంలో తాత్కాలిక తహసీల్దారుగా (FAC) పనిచేస్తున్న ఆమె.. పదోన్నతిపై మండలంలో విధులు నిర్వహించనున్నారు.