ATP: గుంతకల్లు DSP కార్యాలయం ఎదురుగా గురువారం వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మాట్లాడుతూ.. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఎస్పీ శ్రీనివాసులకు అందజేశారు.