E.G: తిరుపతి వెంకటేశ్వర స్వామి వారితో వైసీపీ రాజకీయ పరాచకాలు ఆడుతోందని, రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గమని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి సమావేశాల్లో వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలను ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు. వారి తీరు హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు.