అన్నమయ్య: మదనపల్లి మున్సిపాలిటీకి జేసీ శర్మను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఆయన మున్సిపాలిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నగరంలో మౌలిక వసతుల మెరుగుదల, పెండింగ్ పనుల పూర్తి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, సమర్థవంతంగా మున్సిపల్ పరిపాలన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.