పల్నాడు: రొంపిచర్లకు చెందిన ఓ మహిళ ఫేస్బుక్ ప్రకటన చూసి మోసపోయింది. బాధితుల వివరాల మేరకు.. డబ్బు రెట్టింపు చేస్తామన్న ఫైనాన్స్ కంపెనీ మాయమాటలు నమ్మింది. బ్యాంకు, ఫోన్ పే ద్వారా మొత్తం రూ.50 వేలకు పైగా వారికి చెల్లించింది. తిరిగి డబ్బు కోసం ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.