AKP: పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామంలో ఈనెల 17వ తేదీన జిల్లాస్థాయి కోలాటం పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామంలో జరిగే రామచంద్రమ్మ జాతర సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనే కోలాట బృందాలు తమ పేర్లను ఈనెల 16వ తేదీ సాయంత్రంలోగా కమిటీ వద్ద నమోదు చేయించుకోవాలన్నారు.