కోనసీమ: ఆదివారం మంగళగిరిలో జరిగే చేనేత గర్జనను విజయవంతం చేయాలని రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఊటుకూరు సుబ్రహ్మణ్యం కోరారు. అమలాపురం మండలం బండారులంకలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా నుంచి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.