అన్నమయ్య: జిల్లాలో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర అంతర్రాష్ట్ర ముఠాను మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 4 కిలోల వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాయల్పాడు, బత్తలపల్లి సహా పలు జిల్లాల్లో వీరు చోరీలు చేసినట్లు విచారణలో తేలింది. కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ ధీరజ్ అభినందించారు.