KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్ & బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన విజయమ్మ లేఖపై స్పందిస్తూ.. మహిళల ఆస్తి హక్కులు వ్యక్తిగత కుటుంబ సమస్య కాదని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ తన తల్లి, చెల్లికి సమాన హక్కులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మహిళలు తమ హక్కుల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.