SRCL: వేములవాడ పట్టణాభివృద్ధిలో భాగంగా ముస్లిం సోదరుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం షాదీఖానా నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అక్రమ్, ఇతర మత పెద్దలతో సమావేశమై వారి సలహాలు అడిగి తెలుసుకున్నారు.