KDP: అక్కంపల్లి గ్రామంలో తాగునీటి సమస్యపై టి. సుండుపల్లి మండలంలో టిడిపి ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తక్షణ స్పందన తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి, వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం ఆదేశాలు ఇచ్చారు. సమస్య త్వరగా పరిష్కారమవుతుందని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.