గుంటూరు GGHలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా సర్టిఫికెట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. సాంకేతిక కారణాల వల్ల మూడు రోజులుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సర్వర్ పని చేయడం లేదని, అందుకే పత్రాలు అందించలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు.