SS: కదిరి రూరల్ మండలం సున్నపగుట్ట తండాలోని మజీద్ ఏ ఆయేషా పునర్నిర్మాణానికి వైసీపీ సీనియర్ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. మసీదు కమిటీ సభ్యులకు ఈ నగదును అందజేశారు. దైవ ప్రార్థనా మందిరాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అల్లబకాష, మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఖలందర్ పాల్గొన్నారు.