WG: అదనపు కట్నం వేధింపులు తాళలేక నాగలక్ష్మి (23) అనే మహిళ సోమవారం అత్తిలి మండలం స్కిన్నెరపురంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాళ్ల మండలం జక్కరంకు చెందిన నాగలక్ష్మికి 2018లో కళ్యాణి దుర్గారావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతోనే తన కుమార్తె ప్రాణాలు తీసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.