కోనసీమ: ఆత్రేయపురం మండలం పూడింది గ్రామం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న పాసింజర్ ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.