SKLM: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు సభ్యత్వ విధానాన్ని ప్రవేశపెట్టిందని జనసేన పార్టీ నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గేదెల చైతన్య అన్నారు. శ్రీకాకుళంలో జనసేన సభ్యత్వ నమోదుకి గురువారం శ్రీకారం చుట్టారు. పార్టీని బలోపేతం చేసి నాయకత్వ బాధ్యతలు యువత చేపట్టాలన్నారు.