TPT: ఎర్పేడు మండలం ఆ మందూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఎ.ఆర్.పి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు టూత్పేస్ట్, బ్రష్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి ధర్మారెడ్డి మోహన్ రెడ్డి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిరోజూ దంత ధావన చేయాలని సూచించారు.