కోనసీమ: ప్రభుత్వ ఆదేశాలు మేరకు డా. బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను రావులపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలలో తప్పనిసరిగా నిర్వహించాలని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం సోమవారం ఆదేశించారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరపాలని, సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.