ATP: అనంతపురం గీతా మందిరంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, అహుడ ఛైర్మన్ టీసీ వరుణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, పదివేల సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంనతరం ఏర్పాటుచేసిన శిబిరంలో జనసైనికులు రక్తదానం చేశారు.