CTR: వెదురుకుప్పం మండలం డ్రోన్ నిఘా పర్యవేక్షణలో ఉన్నట్లు ఎస్సై నవీన్ బాబు పేర్కొన్నారు. మండలంలోని చవటగుంట బ్రాహ్మణపల్లి మార్గమధ్యంలో ఎస్సై పోలీస్ సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరాతో వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు. డ్రగ్స్, నాటు సారా తయారీ స్థావరాలపై డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.