KDP: ఏసీబీ అధికారుల దాడులలో పట్టుబడిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణపై మరో కేసు నమోదైంది. ఏసీబీ సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి రూరల్ సీఐ ఇంటిలో సోదాలు నిర్వహించి 59 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బాటిళ్లను పులివెందుల ఎక్సైజ్ కార్యాలయానికి అప్పగించగా, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ చెన్నారెడ్డి బుధవారం తెలిపారు.