VZM: జిల్లాలో మహానాడు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్థల పరిశీలనకు సిద్ధమయ్యారు. భోగాపురం మండలంలో శుక్రవారం ఆయన పర్యటించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతంలో కూడా స్థల పరిశీలన చేయనున్నారు. కాగా వచ్చేనెల 27 నుంచి మహానాడు జరగనుంది.