NLR: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నందు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను వెబ్ సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు సమాచారం కోసం 1100 కాల్ సంప్రదించవచ్చన్నారు.