KRNL: ఓర్వకల్లు(మం)కాల్వ గ్రామంలో సయ్యద్ మహమ్మద్ షా ఖాద్రి ఉరుసు మహోత్సవాన్ని ఘనంగా ఇవాళ నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా గ్రామస్థులు వృషభ రాజుల పోటీలను ఏర్పాటు చేయగా పలు గ్రామాల నుంచి వచ్చిన వృషభాలు పోటీలో పాల్గొన్నాయి. కార్యక్రమానికి టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.