అన్నమయ్య: రాయచోటి కలెక్టరేట్ PGRS హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో DRO మధుసూదన్ రావు, ఆర్డీవో శ్రీనివాస్, ఏడీ సర్వేయర్ భరత్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన అధికారులు, వివిధ సమస్యల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్దిష్ట కాలంలో వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ అధికారులకు తెలిపారు.