PPM: ప్రభుత్వ వైద్యం పేదలకు వరమని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా మెలగాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కొమరాడ(మం) కే.రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.