ప్రకాశం: పెద్దారవీడు MRO దిలీప్ కుమార్, దేవరాజుగట్టు వీఆర్వో విజయభాస్కర్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్లు మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ రాజబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూముల వ్యవహారంలో తహశీల్దార్ దిలీప్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని 25కి పైగా మ్యుటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ చేశారని వివరించారు. భూ అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.