NLR: పోలీసుల తనిఖీలలో భయంతో రైలు నుంచి దూకి ఓ దొంగ మృతి చెందిన ఘటన గూడూరులో మంగళవారం రాత్రి జరిగింది. రైల్వే జీఆర్పీ సీఐ సుధాకర్ ఈ వివరాలను వెల్లడించారు. తిరుపతి నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మెడలో బంగారు చైనును ఓ వ్యక్తి అపహరించాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాగా పోలీసులు చెకింగ్ చేస్తుండగా భయంతో రైలు నుంచి దూకి చనిపోయాడని తెలపారు.