KRNL: తుగ్గలి మండలంలోని ఎద్దులదొడ్డి గ్రామంలో ఇవాళ అన్నదమ్ముల మధ్య పొలం తగాదా కారణంగా ఘర్షణ చోటుచేసుకుంది. బోయ కొత్తికొండ రంగప్ప నాయుడు, వెంకటరాముడుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో రంగప్ప నాయుడు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గత కొంతకాలంగా పొలం విషయంలో తగాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.