కర్నూలు: కాలుష్యం నియంత్రణ లక్ష్యంగా జిల్లాకు తొలిదశలో 50 విద్యుత్తు బస్సులను ఆర్టీసీ కేటాయించింది. వీటిని కర్నూలు, ఎమ్మిగనూరు మార్గాల్లో నడపనున్నారు. ఇందుకోసం రూ.10 కోట్లతో కర్నూలు-2, ఆదోని డిపోల్లో ఛార్జింగ్ కేంద్రాలు , ప్రత్యేక వర్క్ షాపులు అభివృద్ధి చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కి. మీ వరకు ప్రయాణించేలా తయారుచేశారు.