KDP: కాలుష్య నివారణలో భాగంగా ఆర్టీసీ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 1,500 విద్యుత్ బస్సులను వినియోగంలోకి తేనుంది. ఇందులో భాగంగా జిల్లాకు 50 బస్సులు కేటాయించారు. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో కడప, రాజంపేట, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులి వెందుల డిపోలున్నాయి. ప్రస్తుతం వీటిల్లో 710 బస్సులు ఇంధనంతో సేవలు అందిస్తున్నాయి.