AKP: నక్కపల్లి మండలం వేంపాడు ఎంపీపీ స్కూల్ హెచ్ఎం ఆర్.చిరంజీవిని దూషించిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష పోరాట కమిటీ డిమాండ్ చేసింది. దళితులైన హెచ్ఎంని అదే స్కూల్లో పనిచేస్తున్న శివాజీ అవమానించినట్లు కమిటీ ప్రతినిధులు ఎం సుబ్బన్న, చిరంజీవి ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు.