ప్రకాశం: ఇటీవల గ్రూప్ -1కు ఎంపికైన విజేతలకు APUWJ ఆధ్వర్యంలో మార్కాపురం ప్రెస్ క్లబ్లో శనివారం అభినందన సభ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అధ్యక్షులు ఐ వి సుబ్బారావు హాజరై, వారిని అభినందించారు. మొదటి ప్రయత్నంలోనే అత్యంత ఉన్నత ఉద్యోగాన్ని సాధించడం అభినందనీయమనీ కొనియాడారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.