విశాఖపట్నం కలెక్టరేట్ వీసీ హాలులో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొని పొట్టి శ్రీరాముల సేవలను స్మరించుకున్నారు.