NLR: విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంచేందుకు ప్రభుత్వం తెచ్చిన ‘ముస్తాబు’ పథకం పర్యవేక్షణ లేక అటకెక్కింది. ప్రతి బడిలో అద్దం, దువ్వెన, నెయిల్ కట్టర్లతో కార్నర్లు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు అమలు కావడం లేదు. జిల్లాలోని 2,584 స్కూళ్లు, లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితిపై డీఈవో బాలాజీరావు స్పందిస్తూ.. పథకం సక్రమంగా అమలయ్యేలా చూస్తామన్నారు.