కడప: ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. దాదాపు 80 వేలకు పైగా భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నట్టు టీటీడీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. కోదండ రాముని ఆలయం కళ్యాణ వేదిక వద్ద వేలాది మంది భక్తులు కళ్యాణ వేడుకలో పాల్గొని కళ్యాణాన్ని ప్రత్యక్షంగా.. లక్షలాది మంది భక్తులు పరోక్షంగా వీక్షించారు.