E.G: కొవ్వూరు నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు, వంతెనల మరమ్మత్తులకు తగిన చర్యలు తీసుకోవాలని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో రహదారులకు మరమ్మత్తులు చేయలేదని విమర్శించారు. రానున్న గోదావరి పుష్కరాల నాటికి ప్రభుత్వం రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.